Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలి.. రాజన్న బిడ్డలు కాదు.. రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (18:37 IST)
వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. షర్మిల కొత్త పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి... కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు షర్మిలను రంగంలోకి దించారని విమర్శించారు. 
 
షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని ధ్వజమెత్తారు. వైఎస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందించారనే విషయం మర్చిపోవద్దని అన్నారు. 
 
అయినా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని మాత్రమే అని... రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల అంశంపై షర్మిల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments