Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండ్రోజుల్లో టీఆర్​టీ ఫలితాలు

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:20 IST)
ఎట్టకేలకు టీఆర్‌టీ, గ్రూప్​-2 ఫలితాలను ఈ నెలఖరుకల్లా విడుదల చేయాలని టీఎస్​పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో టీఆర్​టీ, గ్రూప్​-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్​టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.

తొలుత గ్రూప్​-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్​టీపై మరోసారి రీలింక్వీష్​మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశిలిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు16 వరకు టీఆర్​టీ అభ్యర్థుల నుంచి రీలింక్వీష్​మెంట్​ను తీసుకుంది.

ఆపై ఆదనంగా అర్హత పొందిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించింది. వీలైనంత తర్వగా టీఆర్​టీ నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పండుగ సెలవుల్లోనూ టీఎస్​పీఎస్సీ అధికారులు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments