Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మళ్లీ భూ ప్రకంపనాల మోత, భయాందోళనలో భాగ్యనగర వాసులు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:51 IST)
హైదరాబాదు నగరాన్ని ఓ వైపు వర్షాలు ముంచెత్తుతుంటే ఇంకోవైపు భూ ప్రకంపనాలు ప్రజలను వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాదు నగరంలో తరుచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నగరంలో మరోసారి భూకంపం సంభవించింది. అయితే ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
 
వైదేహీ నగర్ కాలనీల్లో భారీ శబ్దాలతో భూమి కంపించింది. తెల్లవారు ఝామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సుమారు 5.45 నిమిషాలకు భారీ శబ్దంతో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా ఉదయం 6.40, 7.08 నిమిషాలకు కూడా మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసారు.
 
ఈ భూకంపం తాకిడికి కొందరి ఇళ్లలో శ్లాబ్ పైపెచ్చులు ఊడిపడిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుండి పరుగులు తీయసాగారు. కానీ ఎవరికీ ప్రమాదం సంభవించలేదని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తివారి తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలనీల్లోకి పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ భూకంప వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments