Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మళ్లీ భూ ప్రకంపనాల మోత, భయాందోళనలో భాగ్యనగర వాసులు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:51 IST)
హైదరాబాదు నగరాన్ని ఓ వైపు వర్షాలు ముంచెత్తుతుంటే ఇంకోవైపు భూ ప్రకంపనాలు ప్రజలను వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాదు నగరంలో తరుచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నగరంలో మరోసారి భూకంపం సంభవించింది. అయితే ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
 
వైదేహీ నగర్ కాలనీల్లో భారీ శబ్దాలతో భూమి కంపించింది. తెల్లవారు ఝామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సుమారు 5.45 నిమిషాలకు భారీ శబ్దంతో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా ఉదయం 6.40, 7.08 నిమిషాలకు కూడా మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసారు.
 
ఈ భూకంపం తాకిడికి కొందరి ఇళ్లలో శ్లాబ్ పైపెచ్చులు ఊడిపడిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుండి పరుగులు తీయసాగారు. కానీ ఎవరికీ ప్రమాదం సంభవించలేదని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తివారి తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలనీల్లోకి పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ భూకంప వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments