Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి మంత్రులను ఇంటికి పంపాల్సిందే : రేణుకా చౌదరి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (15:19 IST)
ఎన్డీయే ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను ఇంటికి సాగనంపేవరకు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించారు. సోమవారం కూడా రాజ్యసభ కార్యక్రమాలకు విపక్ష పార్టీలు ఆటంకం కలిగించడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేసింది. 
 
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులు రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని, పార్లమెంట్‌ సమావేశాలు జరగనివ్వమన్నారు. గత 10 రోజులుగా సభా కార్యక్రమాలు నిలిచిపోతే ఇప్పుడు చర్చలు చేపట్టడం అర్థరహితమని అధికార పార్టీని విమర్శించారు. 
 
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌ చౌహాన్‌ రాజీనామా చేసి తీరాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. తమ ప్రాథమిక డిమాండ్లు నెరవేర్చకుండా ఇన్నాళ్లు కాలయాపన చేసి ఇప్పుడు చర్చలకు పిలవడాన్ని రేణుకా చౌదరి తప్పుపట్టారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలంటే ఆ ముగ్గురు రాజీనామా చేయాల్సిందేనని ఆమె తెల్చి చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments