50 రోజులు పూర్తి చేసుకున్న భారత్ జోడో యాత్ర

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:14 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర గురువారానికి యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర చేశారు. 50వ రోజున ఏకంగా 26 కిలోమీటర్ల దూరం రాహుల్ నడిచారు. 
 
50వ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు భారీ సంఖ్యలో పాలుపంచుకున్నారు. యాత్ర ప్రారంభమై గురువారం నాటికి 50 రోజులు కాగా, 50వ రోజున తెలంగాణాలో ఏకంగా 26 కిలోమీటర్ల మేరకు నడిచారు. 
 
ఇదిలావుంటే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర... 50 రోజుల్లోనే 5వ రాష్ట్రంలోని అడుగుపెట్టింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దాటేసి ఇపుడు తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, తెలంగాణాలో ఊహించినదానికంటే ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన రావడం గమనార్హం. 
 
51వ రోజైన శుక్రవారం నారాయణ పేట జిల్లా ఎలిగండ్ల నుంచి రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నారాయణ పేట, దేవరకద్ర, పాలమూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. భోజన విరామ సమయంలో పోడు రైతులు, చేనేత కార్మికలతో రాహుల్ ముచ్చటించనున్నారు. రాహుల్ వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments