కన్నకూతురిపైనే అత్యాచారం

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (18:56 IST)
పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు 5000 రూపాయల  జరిమానా విధించింది. ఈ దారుణం అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో జరిగింది. 

కసాయి తండ్రి రెండేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. 2014 లో అత్యాచారం గురించి పాప స్కూల్ టీచరుతో చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.  తల్లిని కోల్పోయిన  బాలిక  తండ్రి, సోదరుడితో కలిసి ఉంటోంది. తండ్రి రెండేళ్ల నుంచి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండగ సందర్భంగా కుమార్తెను ఇంటికి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పి ఆయన ద్వారా జిల్లా పిల్లల రక్షణ కేంద్రం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలల హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  దోషికి ఈ శిక్ష సరిపోదని, మరణ శిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యాక్షుడు అత్యుత రావు డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం