Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపైనే అత్యాచారం

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (18:56 IST)
పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు 5000 రూపాయల  జరిమానా విధించింది. ఈ దారుణం అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో జరిగింది. 

కసాయి తండ్రి రెండేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. 2014 లో అత్యాచారం గురించి పాప స్కూల్ టీచరుతో చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.  తల్లిని కోల్పోయిన  బాలిక  తండ్రి, సోదరుడితో కలిసి ఉంటోంది. తండ్రి రెండేళ్ల నుంచి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండగ సందర్భంగా కుమార్తెను ఇంటికి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పి ఆయన ద్వారా జిల్లా పిల్లల రక్షణ కేంద్రం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలల హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  దోషికి ఈ శిక్ష సరిపోదని, మరణ శిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యాక్షుడు అత్యుత రావు డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం