Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం - తెలంగాణ డీఐజీ డీజీ భార్య మృతి

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (08:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర సీఐడీ డీజీ గోవింద్ సింగ్ సతీమణి దుర్మరణం పాలయ్యారు. మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయ సందర్శనం కోసం గోవింద్ సింగ్ దంపతులు వెల్లారు. వీరిద్దరూ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రామ్‌గఢ్ వద్ద అదుపుతప్పి బోల్తాపడంది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ ప్రాణాలు కోల్పోయారు. గోవింద్ సింగ్‌తో పాటు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. 
 
అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గోవింద్ సింగ్ స‌తీస‌మేతంగా తెలంగాణ‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రామ్‌‍గ‌ఢ్ స‌మీపంలో ఘంటియాలి మాత ఆల‌యం స‌మీపంలోకి రాగానే గోవింద్ సింగ్ కారు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో షీలా సింగ్ అక్క‌డిక్క‌డే మృతి చెందారు.
 
ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు అక్క‌డికి చేరుకుని గాయ‌ప‌డ్డ గోవింద్ సింగ్‌, ఆయ‌న కారు డ్రైవ‌ర్‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గోవింద్ సింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments