Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాసులకు శుభవార్త... నేడు రేపు వర్షాలు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (09:58 IST)
సూర్య ప్రతాపంతో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుందని వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇకపోతే, గురువారం నల్గొండలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, భానుడి ప్రతాపంలో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments