తెలంగాణాకు శుభవార్త : మూడు రోజుల పాటు వర్షాలు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (17:05 IST)
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణాకు శుభవార్త చెప్పింది. వచ్చే మూడు వారాల పాటు తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌తో పాటు మొత్తం 17 జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. 
 
మరఠ్వాడా నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించివున్న ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా, ఉదయం 11 గంటలు దాటితో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి వార్తను చెప్పడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments