Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండలో రాహుల్ బహిరంగ సభ - భారీగా ఏర్పాట్లు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (10:00 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే ఆరో తేదీన జరిగే ఈ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఉండేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. 
 
ఈ సభ ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసే చర్యల్లోభాగంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. రాహుల్ సభ కోసం జన సమీకరణపై ఇప్పటి నుంచే టీ కాంగ్రెస్ నేతలు దృష్టిసారించారు. 
 
ముఖ్యంగా, మధు యాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితలు క్రియాశీలకంగా వ్యవహిరస్తున్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments