Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘట్‌కేసర్‌లో రెడ్డి సింహగర్జన : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Webdunia
సోమవారం, 30 మే 2022 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌లో రెడ్డి గర్జన పేరుతో సింహగర్జన సభ జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రసంగంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహించిన సభికులు మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు, మంచినీటి బాటిళ్లు, ఇతర సామాగ్రిని విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రతగా ఉన్న పోలీసులు మంత్రిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments