Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘట్‌కేసర్‌లో రెడ్డి సింహగర్జన : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Webdunia
సోమవారం, 30 మే 2022 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌లో రెడ్డి గర్జన పేరుతో సింహగర్జన సభ జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రసంగంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహించిన సభికులు మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు, మంచినీటి బాటిళ్లు, ఇతర సామాగ్రిని విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రతగా ఉన్న పోలీసులు మంత్రిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments