Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరిలో రాష్ట్రపతి: ప్రణబ్ వెంట అభిజిత్.. పూర్ణకుంభంతో స్వాగతం

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (12:46 IST)
యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టకు రాష్ట్రపతితో పాటు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఆలయానికి వచ్చారు. యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌తో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్‌లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
 
ఇటీవలే తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రణబ్ కుమారుడు అభిజిత్ అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక యాదగిరిగుట్టకు కూడా అభిజిత్ తన తండ్రితో పాటే వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
 
ఇకపోతే.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని పోలీసు బలగాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. శనివారం రాత్రికే గుట్టపై భక్తులను పోలీసులు ఖాళీ చేయించేశారు. ఆదివారం మధ్యాహ్నం దాకా గుట్ట ఆలయంలో స్వామివారి దర్శనం, ఇతర సేవలన్నీ బందయ్యాయి. గుట్టపై ఉన్న దుకాణాలను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో ప్రస్తుతం గుట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments