భర్త వేధింపులు తాళలేక.. ఏడు నెలల గర్భిణి.. ఒంటిపై శానిటైజర్ పోసుకుని..?

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (22:30 IST)
భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీకకి చెందిన సిరిపురం సంతోష్ అనే సింగరేణి కార్మికునికి సంవత్సరం క్రితం అనూషతో వివాహం జరిగింది.
 
కొంత కాలం వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికి భర్త సంతోష్ గత కొన్ని నెలలుగా రోజు తాగి వచ్చి భార్య అనూషను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం సంతోష్ యధావిధిగానే తాగి వచ్చి అనూషను కొట్టడంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లో ఉన్న శానిటైజర్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
 
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ని ప్రధాన్ దవాఖానకు తరలించారు. వైద్యులు ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారన్నారు. అనూష సోదరుడు బొద్దుల మల్లయ్య ఫిర్యాదు మేరకు సంతోష్ పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments