PK టీమ్‌తో KCR భేటీ: మూడోసారి అధికారం కోసం కసరత్తు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:15 IST)
దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్(పీకే)తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీకేతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్‌ సేవలు పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
దీంతో పాటు ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం పీకే టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం. పీకే టీమ్‌లో క్రియాశీలకంగా ఉండే ప్రియా రాజేంద్రన్.. షర్మిల పార్టీ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ అనేక సలహాలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్

Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్

Suriya: తమిళ సంవత్సర సందర్భంగా సూర్య కరుప్పు నుండి రాతు రాసన్ విడుదల

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

టాలీవుడ్‌లో మరో ఐరెన్ లెగ్ హీరోయిన్ శ్రీలీలనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తర్వాతి కథనం
Show comments