Webdunia - Bharat's app for daily news and videos

Install App

PK టీమ్‌తో KCR భేటీ: మూడోసారి అధికారం కోసం కసరత్తు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:15 IST)
దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్(పీకే)తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీకేతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్‌ సేవలు పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
దీంతో పాటు ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం పీకే టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం. పీకే టీమ్‌లో క్రియాశీలకంగా ఉండే ప్రియా రాజేంద్రన్.. షర్మిల పార్టీ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ అనేక సలహాలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments