Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో పందుల పెంపకంపై పాలసీ : తలసాని

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (08:02 IST)
త్వరలో పందుల పెంపకంపై మెరుగైన పాలసీ రూపొందిస్తామని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇవాళ పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీ పై పందుల పెంపకం దారుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ వృత్తిపట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రభుత్వం అన్ని విధానాల చూయూతనిస్తుందన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ వృత్తిని పట్టించుకోలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ వృత్తిపై ఆధారపడిన వారికి అవసరమైన సహకారం అందిస్తుందన్నారు.

పందుల పెంపకం కోసం సొంత భూములు కలిగి ఉన్నవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. ఈనెల 25వతేదీన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గొర్రెల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

కులవృత్తులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఒక యూనిట్ విలువ రూ.1.25లక్షలు ఉంటుందన్నారు. ఇందులో 75శాతం ప్రభుత్వ వాటా, 25శాతం లబ్దిదారుడి వాటా ఉంటుందన్నారు. మొదటి విడతలో 3,34,619 మందికి పంపిణీ చేశామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments