Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవద్దు: సీఎం కేసీఆర్ ఆదేశాలు

Webdunia
శనివారం, 15 మే 2021 (16:13 IST)
పోలీసులు, జర్నలిస్టులకు మధ్య గొడవలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఇరువురి మధ్య గొడవలు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. కొవిడ్ లాక్ డౌన్ సందర్భంగా మీడియాకు ప్రభుత్వం పూర్తి అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. వారిని అడ్డుకుంటే ప్రజలకు ఎలాంటి సమాచారం లభించదని తెలిపారు.

చివరకు తాను ఏం మాట్లాడినా కూడా ప్రజల్లోకి వార్తలు వెళ్లే పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను ఆదేశించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ఇందులో ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments