Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన మోడీ.. మిషన్ భగీరథకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర గడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (14:47 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర గడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీతోపాటు పలువురు మంత్రులు ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ నుంచి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన మెదక్ జిల్లా గజ్వేల్‌కు వెళ్లి మిషన్ భగీరథ ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. 
 
కాగా, ఒక మహా సంకల్పానికి ఆదివారం శుభారంభం చేశారు. ఒక యజ్ఞంలా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మిషన్ భగీరథ తొలిదశకు ప్రారంభోత్సవం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ పథకం తొలి ఫలితం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారు. ఇందుకోసం ఒక చరిత్రాత్మక మహోత్సవ సంరంభానికి మెదక్ జిల్లా కోమటిబండ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రధాని సభకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశారు.
 
ప్రధాని తన పర్యటనలో కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 1600 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్‌కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రామగుండంలో నిర్మిస్తున్న ఫర్టిలైజర్ ప్లాంట్‌కు, వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి, మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసి, అదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments