ఉల్లి ధర ఘాటుకు కన్నీళ్లు, మహిళలు, వ్యాపారులు ఆందోళన

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (21:25 IST)
గత కొద్దిరోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిని కొనాలన్నా, కోయాలన్నా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఒక్కసారిగా పెరిగిన ధరతోపాటు అటు మహిళలు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో దిగుబడి దెబ్బతినడంతో ఉల్లి ధరతో పాటు కూరగాయల ధరలు సామాన్యుల జీవింలో తీవ్ర ఆందోళనను తెస్తున్నాయి.
 
ప్రస్తుతం ఉల్లి ధరను వింటేనే పేద, మధ్యతరగతి కుటుంబీకులు వణికిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కిలో ఉల్లి ధర 100 నుండి 120 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ఉల్లి కోయకుండానే కన్నీ ళ్లను తెప్పిస్తోందని ప్రజలు వాపోతున్నారు. అటు ఉల్లితో పాటు మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
దీంతో సామాన్యుడి బతుకు పెను భారంగా మారిపోతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి ధరను నియంత్రిచేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ ప్రక్క వరద ప్రభావం, మరోవైపు కరోనా ఎపెక్ట్ ఈ రెండూ సామాన్యుని జీవితాన్ని చిదిమేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments