Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ బిర్యానీ ఆరగించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఓ హోటల్‌లో బిర్యానీ ఆరగించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల 18వ తేదీన నర్సాపూర్‌లోని ఓ మండి హోటల్‌లో మండి బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి ఇంట్లో ఆరగించారు. ఈ బిర్యానీ ఆరగించిన తర్వాత మొత్తం ఏడుగురు యువకులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
మెదక్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్ అనే యువకులు మండి హోటల్‌లో బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి, నర్సాపూర్‌కు చెందిన అజీజ్, మరో ఆరుగురు మిత్రులతో కలిసి ఆరగించారు. ఈ బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు కావడంతో అస్వస్థతకు లోనయ్యారు. 
 
వీరిలో మహేష్, షకీల్, నాని తదితరులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలివారు ఇంటివద్దనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రభుత్వం ఏరియా ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మీర్జానజీంబేగ్‌ను మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగానే వారికి వాంతులు విరేచనాలు అయినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments