Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:33 IST)
ఓ ప్రయాణికుడు గుండెపోటుతోనే బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్..  ప్రయాణికుడి మృతదేహాన్ని బస్సులోనే మృతుని ఇంటికి చేర్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో జరిగింది. 
 
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 14వ తేదీన మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళుతోంది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో హుస్సేన్ అనే ప్రయాణికుడు మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. తోటి ప్రయాణికులను విచారించగా, హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెంగా చెప్పారు. 
 
ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్యలు ఉన్నతాధికారులకు చేరవేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెంకు తరలించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులంతా ప్రశసించారు. ఈ విషయం ఎండీ వీసీ సజ్జనార్‌కు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో పాటు డిపో మేనేజరు విజయ్‌లను శనివారం బస్ భవన్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విలన్లు, స్మగ్లర్లు హీరోలుగా చూపిస్తున్నారు: వెంకయ్య నాయుడు చురకలు

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

Vinayak: దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యం గా వున్నారంటున్న వినాయక్ టీమ్

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments