Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:33 IST)
ఓ ప్రయాణికుడు గుండెపోటుతోనే బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్..  ప్రయాణికుడి మృతదేహాన్ని బస్సులోనే మృతుని ఇంటికి చేర్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో జరిగింది. 
 
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 14వ తేదీన మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళుతోంది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో హుస్సేన్ అనే ప్రయాణికుడు మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. తోటి ప్రయాణికులను విచారించగా, హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెంగా చెప్పారు. 
 
ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్యలు ఉన్నతాధికారులకు చేరవేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెంకు తరలించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులంతా ప్రశసించారు. ఈ విషయం ఎండీ వీసీ సజ్జనార్‌కు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో పాటు డిపో మేనేజరు విజయ్‌లను శనివారం బస్ భవన్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ థియేట్రికల్ రిలీజ్

మహేష్ బాబు పేరు ఉన్న డైలాగ్ వినగానే చాలా ఫన్నీగా వుందన్నారు : సుధీర్ బాబు

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ పూర్తి

డిస్ట్రిబ్యూటర్‌గా మారిన నటుడు సుహాస్

తండ్రి కుర్చీ కోసం ఆశపడటం లేదు.. కానీ : హీరో విజయ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments