Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:33 IST)
ఓ ప్రయాణికుడు గుండెపోటుతోనే బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్..  ప్రయాణికుడి మృతదేహాన్ని బస్సులోనే మృతుని ఇంటికి చేర్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో జరిగింది. 
 
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 14వ తేదీన మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళుతోంది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో హుస్సేన్ అనే ప్రయాణికుడు మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. తోటి ప్రయాణికులను విచారించగా, హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెంగా చెప్పారు. 
 
ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్యలు ఉన్నతాధికారులకు చేరవేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెంకు తరలించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులంతా ప్రశసించారు. ఈ విషయం ఎండీ వీసీ సజ్జనార్‌కు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో పాటు డిపో మేనేజరు విజయ్‌లను శనివారం బస్ భవన్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments