Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు... ఎక్కడ?

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (18:40 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలను తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆ రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. దీంతో జులై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ అన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. వెంటనే ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఆదేశించారు. 
 
మరోవైపు, సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ, టీఎస్ నాయకులు కలిశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని కోరారు. 
 
రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గ‌డంతో ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠ‌శాల‌లు తిరిగి స్కూల్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే ఎలాంటి స‌న్న‌ద్ధ‌త లేకుండా పాఠ‌శాల‌లు ఎలా ప్రారంభిస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించిన నేప‌థ్యంలో ఇపుడు ఆన్‌లైన్ తరగతుల వైపు సర్కారు మొగ్గు చూపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments