Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:30 IST)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్నాళ్లు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది.

దీనిపై సుమారు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు అనుమతించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments