Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:30 IST)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్నాళ్లు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది.

దీనిపై సుమారు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు అనుమతించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments