నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మళ్లీ నుమాయిష్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:26 IST)
హైదరాబాదులో నుమాయిష్ నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభించడం ద్వారా ఈసారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. ప్రభుత్వ కఠిన ఆంక్షల కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. 
 
ప్రస్తుతం తెలంగాణ సర్కారు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన కారణంగా మళ్లీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది.
 
ఈనెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ పునఃప్రారంభం అవుతుందని ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. కాగా, జనవరి 1వ తేదీన ప్రారంభమైన నుమాయిష్.. కోవిడ్‌ ఆంక్షల కారణంగా జనవరి 3వ తేదీ నుంచి మూసివేశారు. 
 
ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలిగించడంతో మళ్లీ నుమాయిష్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments