మాదన్నపేట మండి... చినుకు పడితే చిత్తడి

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:31 IST)
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లలో ఒకటైన మాదన్నపేట మండి చినుకుపడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. చిన్నపాటి వర్షానికే మార్కెట్‌లో అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. శివారులోని రంగారెడ్డి జిల్లా నుండి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికి చేరుకుంటారు.
 
నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు ఈ మండికి కొనుగోళ్ల కోసం వస్తారు. రైతులు, వినియోగదారుల రాకపోకలతో మాదన్నపేట మండి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణ మురుగు జలాశయంలా మారింది. మార్కెట్లో వర్షం నీరు బయటికి వెళ్ళే మార్గం లేక మండి మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్ లోకి వెళ్లివచ్చే వీలులేక వినియోగదారులు తగ్గిపోయారు. 
 
కానీ కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయప్రయాసలకు ఓర్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటను వర్షం నీరు, బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండిలో అమ్మకం పన్నులు చెల్లిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించరా అని మార్కెటింగ్ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ ఎంసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి మాదన్నపేట మండి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSRajamouli: వారణాసితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా వున్నాయంటున్న రాజమౌళి

అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్టుపై ప్రకటన.. హీరోలు ఎవరంటే...

Anil ravipudi: కళ్యాణ్ రామ్, వెంకటేష్ తో సంక్రాంతి కి వస్తున్నా: అనిల్ రావిపూడి

Virosh Wedding : నేను ఆమెను మిస్ అయ్యానన్న విజయ్.. నీ భార్యగా నేను.. నా భర్తను పరిచయం చేస్తున్నాను.. (Photos)

Sri Vishnu: గ్రహాలని, జాతకాలలో కొన్నింటినే ఫాలో అవుతా : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments