Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్‌ లేకుంటే నో ఎంట్రీ, అయినా వీళ్లు మారరా?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (20:38 IST)
సైబరాబాద్‌ పరిధిలో రోడ్డు భద్రత కోసం తొలిసారిగా చెక్‌ పోస్టులను నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర హైవే లపై హెల్మెట్‌ లేని వారికి ఎంట్రీ లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యం రాజీవ్‌ రహదారి, ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ -65 రహదారులు, శంషాబాద్‌, షాద్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక రోడ్డు భద్రత చెక్‌ పోస్టులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి హెల్మెట్‌ ధరించే వరకు వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
 
ఎలాంటి జరిమానాలు, ఈ-చలాన్లు ఇవ్వడం లేదు. హెల్మెట్‌ ధరించిన తర్వాతనే రోడ్డుపై అనుమతి ఇస్తున్నారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనంపై ఉండే పిలియన్‌ రైడర్‌ (వెనకాల కూర్చున్న వ్యక్తి) కూడా హెల్మెట్‌ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 
దీంతో చెక్‌ పాయింట్‌ వద్ద వాహన దారులను అర్ధాంతరంగా నిలిపి వేయడంతో వారు కొంత అసహనానికి గురవుతున్నారు. అయినప్పటికీ ఆ తర్వాత హెల్మెట్‌లు ధరించి వాహనాలను నడిపిస్తుండటం కొంత మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని వాహన దారులు పోలీసులకు వివరిస్తున్నారు. 
 
ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలనే లక్ష్యంగా కొత్త సంవత్సరంలో ఈ ప్రక్రియను అవలంభిస్తున్నామని డీసీపీ ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments