Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందిచ్చి ముంచేశారు... పెళ్లిలో వధువు నగల బ్యాగ్ చోరీ!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (08:41 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బార్దిపూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో చోరులు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. వధువు నగల బ్యాగుతో ఉన్న మహిళకు మత్తు మందు ఇచ్చి, మాటల్లో దించి ముంచేశారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నగల బ్యాగుతో ఉడాయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిచ్‌పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఓ వివాహం జరిగింది. వివాహానికి బంధువులు తెచ్చిన బంగారం, గిఫ్టులు భారీగానే వచ్చాయి. ఇందులో విలువైన ఆభరణాలను మాత్రం ఓ మహిళ తన బ్యాగులో భద్రపరిచింది. ఈ విషయాన్ని గ్రహించిన చోరులు.. ఆమెకు మత్తు ఇంజిక్షన్ ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. 
 
మత్తునుంచి తేరుకున్న మహిళా.. విషయాన్ని బంధువులకు చెప్పండంతో ఫంక్షన్ హాల్ మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు యువకులు బ్యాగ్ ఎత్తుకెళ్లినట్టు తేలింది. బ్యాగ్‌లో 35 తులాల బంగారు ఆభరాణాలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments