పెళ్లి వేడుక.. 50మందికి కరోనా.. ఎక్కడంటే?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (10:33 IST)
పెళ్లి వేడుకలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో పది రోజుల కిందట జరిగిన ఒక వివాహ వేడుక కారణంగా 50మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 193 గృహాలున్న క్యాంపులో 42 ఇళ్లలోని వారికి వైరస్‌ సోకింది. 
 
అయితే వారి ఆదాయ మార్గమైన గేదెల ఆలనాపాలనా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మరోవైపు కోవిడ్‌ భయంతో ఇక్కడ పాలు కొనడానికి ఎవరూ రావడం లేదు. పాల కేంద్రం 20రోజులు మూసి ఉంచాలని నిర్ణయించారు.
 
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. 
 
ఇందులో 86,095మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్

Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?

Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments