Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుక.. 50మందికి కరోనా.. ఎక్కడంటే?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (10:33 IST)
పెళ్లి వేడుకలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణ పరిధిలోని చెక్కీ క్యాంపులో పది రోజుల కిందట జరిగిన ఒక వివాహ వేడుక కారణంగా 50మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 193 గృహాలున్న క్యాంపులో 42 ఇళ్లలోని వారికి వైరస్‌ సోకింది. 
 
అయితే వారి ఆదాయ మార్గమైన గేదెల ఆలనాపాలనా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. మరోవైపు కోవిడ్‌ భయంతో ఇక్కడ పాలు కొనడానికి ఎవరూ రావడం లేదు. పాల కేంద్రం 20రోజులు మూసి ఉంచాలని నిర్ణయించారు.
 
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. 
 
ఇందులో 86,095మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments