Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్ క్రీమ్ కోసం ఫ్రిజ్ తెరిచిన చిన్నారి మృత్యువాత.. ఎలా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో విషాదం జరిగింది. ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి ఒకరు మృత్యువాత పడింది. ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్రీమ్‌ను తీసుకునేందుకు డోర్ తీయగానే ఆమెకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నందిపేట్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటకు చెందిన గూడూరు రాజశేఖర్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి నందీపేట్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళుతుండగా, కుమార్తె రిషిత (4)ఐస్ క్రీమ్ కావాలని మారాం చేసింది. దీంతో స్థానికంగా ఉండే ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. 
 
తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments