Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట మునిగిన నిర్మల్ జిల్లా... సరదాగా చేపలు పడుతున్న మంత్రి

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:29 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నిర్మల్ జిల్లా అతలాకుతలమైపోయింది. ఈ జిల్లా పూర్తిగా నీటమునిగిపోయింది. నెల రోజులకు క్రితం ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టరేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. 
 
ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలతో నిర్మల్‌ పట్టణం జలమయమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీ అంతా నీట మునిగింది. కాలనీలో మొదటి అంతస్తు వరకు వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. ముంపు కాలనీల్లోని ఇండ్లలో వందలాదిమంది వరదనీటిలో చిక్కుకున్నారు. నాటు పడవల సహాయంతో జనాలను బయటకు సురక్షితంగా తరలిస్తున్నారు. బైంసా డివిజన్‌లో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
 
అయితే, జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు చెరువుల కబ్జాలతో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడతుంటే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం అధికార యంత్రంగంతో సరదాగా విహార యాత్ర వెళ్లి చేపలు పడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments