Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో త్వరలో కొత్త ఉపకులపతులు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (12:01 IST)
తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలకు అతిత్వరలో కొత్త ఉపకులపతులు రానున్నారు. ప్రభుత్వం ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ నియామక దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసైకి పంపించింది.

గవర్నర్‌ ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌, శాతవాహన, అంబేడ్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వర్సిటీలకు 2019 జూన్‌ నుంచి ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.

ఈ పదవులకు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగకపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాయి.

వరుస ఎన్నికలు, కరోనా ప్రభావంతో ఆ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పాలకమండలిని నియమించిన ప్రభుత్వం వీసీల నియామకాలను సైతం వెంటనే చేపట్టాలని భావించింది. అయితే, గవర్నర్‌ తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారు.

వీసీల దస్త్రానికి గురువారం ఆన్‌లైన్‌లో గవర్నర్‌ ఆమోదం తెలిపితే నియామక ఉత్తర్వులు వెలువడే వీలుంది. గవర్నర్‌ హైదరాబాద్‌ వచ్చాక ఆ దస్త్రాన్ని పరిశీలించే నేపథ్యంలో మరో రెండు రోజులు జాప్యం జరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments