Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో త్వరలో కొత్త ఉపకులపతులు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (12:01 IST)
తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలకు అతిత్వరలో కొత్త ఉపకులపతులు రానున్నారు. ప్రభుత్వం ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ నియామక దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసైకి పంపించింది.

గవర్నర్‌ ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌, శాతవాహన, అంబేడ్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వర్సిటీలకు 2019 జూన్‌ నుంచి ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.

ఈ పదవులకు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగకపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాయి.

వరుస ఎన్నికలు, కరోనా ప్రభావంతో ఆ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పాలకమండలిని నియమించిన ప్రభుత్వం వీసీల నియామకాలను సైతం వెంటనే చేపట్టాలని భావించింది. అయితే, గవర్నర్‌ తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారు.

వీసీల దస్త్రానికి గురువారం ఆన్‌లైన్‌లో గవర్నర్‌ ఆమోదం తెలిపితే నియామక ఉత్తర్వులు వెలువడే వీలుంది. గవర్నర్‌ హైదరాబాద్‌ వచ్చాక ఆ దస్త్రాన్ని పరిశీలించే నేపథ్యంలో మరో రెండు రోజులు జాప్యం జరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments