తెలంగాణలో త్వరలో కొత్త ఉపకులపతులు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (12:01 IST)
తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలకు అతిత్వరలో కొత్త ఉపకులపతులు రానున్నారు. ప్రభుత్వం ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ నియామక దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసైకి పంపించింది.

గవర్నర్‌ ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌, శాతవాహన, అంబేడ్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వర్సిటీలకు 2019 జూన్‌ నుంచి ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.

ఈ పదవులకు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగకపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాయి.

వరుస ఎన్నికలు, కరోనా ప్రభావంతో ఆ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పాలకమండలిని నియమించిన ప్రభుత్వం వీసీల నియామకాలను సైతం వెంటనే చేపట్టాలని భావించింది. అయితే, గవర్నర్‌ తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారు.

వీసీల దస్త్రానికి గురువారం ఆన్‌లైన్‌లో గవర్నర్‌ ఆమోదం తెలిపితే నియామక ఉత్తర్వులు వెలువడే వీలుంది. గవర్నర్‌ హైదరాబాద్‌ వచ్చాక ఆ దస్త్రాన్ని పరిశీలించే నేపథ్యంలో మరో రెండు రోజులు జాప్యం జరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments