Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువు అదృశ్యం.. బట్టల బ్యాగుతో వెళ్లిపోయిందని...

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (13:30 IST)
నవ వధువు అదృశ్యమైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ పేజ్- 2కు చెందిన పీ. సైదులు కుమారుడు అశోక్‌కు అదే ప్రాంతానికి చెందిన చైత్రభార్గవి(18)తో పెద్దల సమక్షంలో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు కావడంతో అశోక్ సోదరి వెంకటరమణ వారితోనే ఇంట్లోనే ఉంటోంది.
 
అయితే ఈనెల 14వ తేదీన అశోక్ నైట్ డ్యూటీకి వెళ్లి 15వ తేదీన ఉదయం ఇంటికి వచ్చి గదిలో పడుకున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో వెంకటరమణ.. తన కుమార్తెను స్కూల్ వద్దకు తీసుకెళ్లింది. 30 నిమిషాల్లో వెంకటరమణ తిరిగి ఇంటికి వచ్చేసరికి చైత్రభార్గవి ఇంట్లో కనిపించలేదు. 
 
దీంతో హాడావిడిగా వారు వాచ్ మెన్‌ను అడగ్గా బట్టల బ్యాగుతో చైత్ర వెళ్లిందని తెలిపారు. అది తెలిసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే.. ఇంట్లో ఏమైనా ఇబ్బందులతో ఆమె వెళ్లిపోయిందా.? లేక మరేదైనా కారణం ఉందా.? అనేది విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments