Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువు అదృశ్యం.. బట్టల బ్యాగుతో వెళ్లిపోయిందని...

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (13:30 IST)
నవ వధువు అదృశ్యమైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ పేజ్- 2కు చెందిన పీ. సైదులు కుమారుడు అశోక్‌కు అదే ప్రాంతానికి చెందిన చైత్రభార్గవి(18)తో పెద్దల సమక్షంలో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు కావడంతో అశోక్ సోదరి వెంకటరమణ వారితోనే ఇంట్లోనే ఉంటోంది.
 
అయితే ఈనెల 14వ తేదీన అశోక్ నైట్ డ్యూటీకి వెళ్లి 15వ తేదీన ఉదయం ఇంటికి వచ్చి గదిలో పడుకున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో వెంకటరమణ.. తన కుమార్తెను స్కూల్ వద్దకు తీసుకెళ్లింది. 30 నిమిషాల్లో వెంకటరమణ తిరిగి ఇంటికి వచ్చేసరికి చైత్రభార్గవి ఇంట్లో కనిపించలేదు. 
 
దీంతో హాడావిడిగా వారు వాచ్ మెన్‌ను అడగ్గా బట్టల బ్యాగుతో చైత్ర వెళ్లిందని తెలిపారు. అది తెలిసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే.. ఇంట్లో ఏమైనా ఇబ్బందులతో ఆమె వెళ్లిపోయిందా.? లేక మరేదైనా కారణం ఉందా.? అనేది విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments