Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అమలు: కేసీఆర్ ప్రకటన

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (14:50 IST)
అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ మద్యం విధానాన్ని తీసుకొస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గుడుంబా మహమ్మారితో ఎన్నో కుటుంబాలు అనాథలు అవుతున్నాయన్నారు.

ప్రాణాలకు హాని కలిగించని మద్యాన్ని తయారు చేయాలని కేసీఆర్ చెప్పారు. హైదరాబాదులో ఎన్నో ప్రాంతాల ప్రజలు ఉన్నారని... అందువల్ల అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం పాలసీని తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ మేరకు శుక్రవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో నినాదాలు చేశారు. అనంతరం, లోక్ సభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందుకు వెళ్లి నిలబడి మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు.

గత పార్లమెంటు సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేసింది. ప్రత్యేక హైకోర్టు లేకపోతే తెలంగాణకు న్యాయం జరగదని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments