Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40 లక్షలు : హోంమంత్రి నాయిని

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2015 (10:48 IST)
నల్గొండ జిల్లా సూర్యాపేటలో అర్థరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, కానిస్టేబుళ్లను పరామర్శించిన తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. 
 
దొంగల కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ లింగయ్య కుటుంబానికి రూ.40 లక్షల పరిహారాన్ని ప్రకటించిన నాయిని, హోంగార్డు మహేశ్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర ప్రయోజనాలను కూడా బాధిత కుటుంబాలకు అందిస్తామని నాయిని అందచజేశారు.
 
అంతకుముందు దోపిడీ దొంగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగులయ్యను నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. ఆయన శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు తెలిపాయి. అర్థరాత్రి సోదాలు చేస్తున్న పోలీసులపై మెరుపుదాడి చేసిన దోపిడీ దొంగలు ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన మొగులయ్య, మరో కానిస్టేబుల్‌ను హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. 
 
కాగా, మొగులయ్య శరీరంలోని ఒక బుల్లెట్, మరో కానిస్టేబుల్ శరీరంలోని ఒక బుల్లెట్‌ను వైద్యులు వెలికితీశారు. మొగులయ్య శరీరంలోని మరో రెండు బుల్లెట్లను వెలికితీసేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments