Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నాగసాధువుల శాపాల దాడి... వణికిపోతున్న ఛోటా నాయకులు

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (19:33 IST)
బాబాల శృంగార కార్యకలాపాలు ఈ మధ్య వార్తల్లో వీర విహారం చేసాయి. అదేవిధంగా ఇప్పుడు మరికొంత మంది కొత్త తరహాలో నాగసాధువులమంటూ ప్రజా ప్రతినిధులపై విరుచుకుపడుతున్నారు. మాట వినకపోతే శపిస్తామని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరు సాధువులు వివిధ బృందాలుగా ఏర్పడి సంచరిస్తున్నారు. 
 
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామాల వెంబడి తిరుగుతూ సర్పంచ్‌ల ఇంటికి నేరుగా వెళుతున్నారు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పలు పూజలు చేయాలని, చేయకపోతే అరిష్టం అని భయపెడుతున్నారు. కొందరు ఏమీ చేయలేక ఐదు వందలు, వెయ్యి రూపాయలు ముట్టజెపుతున్నారు. తాము నేరుగా కుంభమేళా నుంచి వస్తున్నామని తాము చెప్పినట్లు వినాలని ఆదేశిస్తున్నారు. వినకపోతే శపిస్తామని బెదిరిస్తున్నారు. 
 
కొందరు తిరస్కరించి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని చెబుతున్నా వినడం లేదు. బాధితులు అసహనంతో పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు రంగంలోకి దిగారు. పలు బృందాలను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు చెప్పిన మాటలకు కొంతమంది సర్పంచ్‌లు ఆందోళన చెందుతూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments