70 యేళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (11:20 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 యేళ్లుగా ముస్లిం ప్రజలను అన్ని పార్టీల నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తరతరాలుగా ముస్లిం ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం రాజకీయ పార్టీలకు ఏమాత్రం నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయాలకు నచ్చదన్నారు. 
 
ముఖ్యంగా, మహత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని.. గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని భారత్‌‍లో మీరు నిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments