Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిగదిలో తల్లీకుమారుడు ఆత్మహత్య.. పెట్రోల్ పోసుకుని నిప్పించుకున్నారు..

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:19 IST)
కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీకుమారుడు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డిలోని రామాయంపేటలోని ఇద్దరు లాడ్జి గదిలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్‌కు పాల్పడ్డారు. 
 
ఆత్మహత్య కంటే ముందు కుమారుడు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారుతోంది. ఆ వీడియోలో తమ ఆత్మహత్యకు స్థానిక రాజకీయ నాయకులతో పాటు కొంతమంది పోలీసు అధికారుల వేధింపుల కారణమని తెలిపాడు. వ్యక్తిగతంగా కొందరు బెదిరించడం వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంతోష్ వెల్లడించాడు.
 
వివరాల్లోకి వెళ్తే.. పద్మ, సంతోష్‌ అనే తల్లీకుమారులిద్దరూ ఈ నెల 11న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. తల్లి పద్మ వైద్యం కోసం వీరు కామారెడ్డి వచ్చినట్టుగా తెలిసింది. 
 
అయితే వారు ఉంటున్న రూమ్‌లోనే నిప్పంటించుకున్నారు. వారి గది నుంచి తెల్లవారుజామన పొగలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు.
 
ఈ క్రమంలోనే మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లి చూడగా తల్లి, కుమారుడు చనిపోయి ఉన్నారు. దీంతో వాళ్ల సెల్ ఫోన్ పరిశీలించగా అందులో సెల్ఫీ వీడియోతో పాటు ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments