తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పది : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:37 IST)
తమిళనాడు రాష్ట్ర అస్తిత్వం చాలా గొప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. పైగా, ఇక్కడి ప్రజలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పారు. చెన్నైలో ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకు వచ్చిన ఆమె.. శుక్రవారం నగర శివారు ప్రాంతమైన గెరుగంబాక్కంలో హీరో అర్జున్ నిర్మించిన అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నారు. 
 
తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments