తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పది : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:37 IST)
తమిళనాడు రాష్ట్ర అస్తిత్వం చాలా గొప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. పైగా, ఇక్కడి ప్రజలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పారు. చెన్నైలో ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకు వచ్చిన ఆమె.. శుక్రవారం నగర శివారు ప్రాంతమైన గెరుగంబాక్కంలో హీరో అర్జున్ నిర్మించిన అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నారు. 
 
తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments