Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజగోపాల్ అన్నా తొందరపడకు.. మాటజారకు...: ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:58 IST)
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఒక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సమర్చించిన చార్జిషీటులో కవిత పేరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ చార్జిషీటులో "లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉంది'' అని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. "రాజగోపాల్ అన్నా... తొందరపడకు.. మాట జారకు.. 28 సార్లు నా చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.." అని కవిత రీట్వీట్ చేశారు. 
 
మరోవైరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. మున్ముందు కవిత ఇవ్వాల్సిన వివరణలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై కూడా కవిత స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి. అబద్ధం. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments