Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గండ్ర దంపతులకు పాజిటివ్ - అధికారుల్లో టెన్షన్

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (11:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. ఈ వైరస్ అనేక మంది రాజకీయ ప్రముఖులకు సోకుతుంది. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ కాటేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య, జడ్జీ ఛైర్మన్ గండ్ర జ్యోతికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారిద్దరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. 
 
అదేసమయంలో వారితో కాంటాక్ట్ అయిన మంత్రులు, అధికారులకు ఇపుడు టెన్షన్ మొదలైంది. తాజాగా జిల్లాలో పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర నేతలతో కలిసి వీరిద్దరూ పర్యటించారు. మంత్రులతో కలిసి పరకాల నుంచి నర్సంపేట వరకు హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
ఈ క్రమంలో మంగళవారం వారిద్దరికి చలిజ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయగా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. తమతో సన్నిహితంగా ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వీరు ప్రస్తుతం తెరాసలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments