Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదు : ఈటల రాజేందర్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (13:43 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాను పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేయలేదని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, జమ్మికుంటలో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈటల సోమవారం పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా.. అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యమన్నారు. ఆ మేరకే గజ్వేల్‌ నుంచి పోటీ చేయనున్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను అంత ఆషామాషీగా చేయలేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments