Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రే కామాంధుడు, కాలయముడు... అత్యాచారం చేసి చంపేశాడు... రంగారెడ్డి బాలిక కేసు

Webdunia
శనివారం, 23 మే 2015 (19:00 IST)
ఆ బాలిక తన కన్నతండ్రే కామాంధుడుగా మారి తన పట్ల కాలయముడుగా మారుతాడని అనుకొని ఉండదు. శెలవులకు బాబాయి ఇంటికి వెళ్లిన కుమార్తెను రాత్రిపూట తీసుకెళ్లేందుకు ఆ బాలిక బంధువులు వారించినా కామాంధుడుగా మారిన ఆమె తండ్రి అంత రాత్రివేళ తీసుకుని వెళ్లిపోయాడు. అత్యాచారం చేసి చంపేసి ఎవరో హత్య చేశారని కథ అల్లాడు.

రంగారెడ్డి జిల్లా బంట్వారంలో బాలిక ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్లు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారని తండ్రి అల్లిన కథ వట్టిదని తేలింది. కన్నతండ్రే కన్నకూతురిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు తేల్చారు. ఆటో డ్రైవర్లు బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశారని చెప్పిన తండ్రే అసలు నిందితుడని పోలీసులు కనుగొన్నారు. 
 
కూతురిని హత్య చేసిన తర్వాత తలకి గాయం చేసుకున్న తండ్రి మెగావత్ కమల్ పొంతనలేని సమాధానాలు చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పటికే 33 మంది ఆటోడ్రైవర్లను పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో ఆటోడ్రైవర్ల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణలో ఆటో డ్రైవర్లది తప్పులేదని తేలడంతో.. తండ్రి వద్దే మళ్లీ విచారణ జరిపి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పొంతన లేని సమాధానం చెప్పడం అసలు దొంగైన తండ్రి దొరికిపోయాడు. కన్నతండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడి అమానవీయ చర్యకు పాల్పడటం సంచలన సృష్టిస్తోంది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments