Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ.. కేటీఆర్ పిలుపు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:36 IST)
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్లకు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. 
 
సెప్టెంబర్ 2న జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
 
సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలని, సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపు మండల కమిటీలు,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
 
వీటి తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. 
 
సెప్టెంబర్ ఆఖరులోపు ఈ కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో 150 డివిజన్ల కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments