Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు: తెలంగాణ మంత్రి

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (20:53 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యుత్ సంస్కరణలపై ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడంలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. మెడ మీద కత్తి పెట్టినా బావుల వద్ద కరెంట్ మీటర్లు పెట్టమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పినట్లు హరీష్‌రావు గుర్తుచేశారు. విద్యుత్ సంస్కరణలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. 
 
పనిలో పనిగా బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 40వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నాయకులు ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. 
 
బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ పార్టీ అతీగతీ లేని పార్టీ అని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments