Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (07:28 IST)
అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికోసం రూ.15వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సమీపంలో స్థలాన్ని కూడా కంపెనీ ఎంచుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మరో 3 నెలలు పట్టే అవకాశం ఉంది.
 
మైక్రోసా్‌ఫ్టకు ఇప్పటికే హైదరాబాద్‌లో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఉంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియోతో మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపిన సంగతి తెలిసిందే.  కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ వంటి కొత్తతరం టెక్నాలజీల వినియోగం పెరగడంతో డేటా సెంటర్ల ఏర్పాటు కంపెనీలకు కీలకంగా మారింది.

వీటి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు భారత్‌లో అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి.  డేటాను స్థానికంగానే ఉంచాలన్న నిబంధన కూడా అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా కేంద్రాలను ఏర్పాటుచేయడానికి ఊతమిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments