Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకే ఏపీ రాజ్యసభ సభ్యుడు... తెలంగాణలో ఎలా ఓటేస్తారు?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:31 IST)
కేకేపై వెంకయ్యనాయుడికి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు.

తెరాస మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడిని లక్ష్మణ్​ నేతృత్వంలోని బృందం దిల్లీలో కలిసింది. తెరాస రాజ్యసభ ఎంపీ కేశవరావుపై భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు మున్సిపల్​ ఎన్నికల్లో ఎక్స్​ అఫీషియో కింద ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసిందని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఏపీ రాజ్యసభ ఎంపీ కేశవరావుకు ఎలా ఓటు కల్పిస్తారని ప్రశ్నించారు. తుక్కుగూడలో భాజపాకు పూర్తి మెజారిటీ వచ్చినా అక్రమంగా తెరాస సభ్యులు గెలిచారని ఆరోపించారు.

కేకేపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని లక్ష్మణ్​ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments