కేకే ఏపీ రాజ్యసభ సభ్యుడు... తెలంగాణలో ఎలా ఓటేస్తారు?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:31 IST)
కేకేపై వెంకయ్యనాయుడికి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు.

తెరాస మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడిని లక్ష్మణ్​ నేతృత్వంలోని బృందం దిల్లీలో కలిసింది. తెరాస రాజ్యసభ ఎంపీ కేశవరావుపై భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు మున్సిపల్​ ఎన్నికల్లో ఎక్స్​ అఫీషియో కింద ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసిందని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఏపీ రాజ్యసభ ఎంపీ కేశవరావుకు ఎలా ఓటు కల్పిస్తారని ప్రశ్నించారు. తుక్కుగూడలో భాజపాకు పూర్తి మెజారిటీ వచ్చినా అక్రమంగా తెరాస సభ్యులు గెలిచారని ఆరోపించారు.

కేకేపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని లక్ష్మణ్​ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments