Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీకి వెళుతున్నాని వ్యవసాయ బావిలో శవమై తేలిన మెడికో

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (18:02 IST)
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామనికి చెందిన ఓ మెడికో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కనుపర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వంశీ కాలేజీకి వెళుతున్నానంటూ శుక్రవారం బయటకు వెళ్లిన వ్యక్తి స్వంత వ్యవసాయ బావిలో శనివారం శవమై  కనిపించాడు. కాళ్ళూ చేతులు తాళ్లతో కట్టి వేసి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 
వివరాలు చూస్తే... తుమ్మనపల్లి తిరుపతి - రమా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడైన వంశీ (22) ఖమ్మం జిల్లా మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ శుక్రవారం సాయంత్రం ఖమ్మం బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. కానీ శనివారం గ్రామ శివారులోని వారి సొంత వ్యవసాయ భూమిలో శవమై తేలాడు. 
 
ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా బోరున విలపించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం గ్రామంలో ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పరకాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments