మృత్యువుతో 5 రోజులుగా పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:47 IST)
వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. అంతకుముందు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. ప్రీతి మృతిపై నిమ్స్ వైద్యులు ప్రకటన చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
 
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే వుందని ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సీనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి ఆమె కన్నుమూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments