Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి సంవత్సరమే, ప్రియుడి కోసం ఇంట్లో బంగారు, వెండి దొంగతనం

Webdunia
గురువారం, 27 మే 2021 (19:04 IST)
ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ప్రియురాలి ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటి నుంచే బంగారు, వెండి నగలను దొంగిలించి నగదుగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన భర్త, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా వారి నుంచి 63 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
ఖమ్మం నగరానికి చెందిన జ్యోతి అనే యువతికి అశోక్ అనే వ్యక్తితో సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే వివాహితకు వివాహానికి ముందే శివ అనే వ్యక్తితో సంబంధం ఉంది. వివాహమైన తరువాత కూడా రహస్యంగా ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే పెళ్ళైన తరువాత ప్రియుడితోనే ఉండిపోవాలనుకుంది.
 
అందుకు డబ్బులు అవసరం కాగా భర్త ఇంటిలోనే స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి ఇంటిలోని బంగారు, వెండి, ల్యాప్‌ట్యాప్‌లను దొంగిలించింది. ఏమీ ఎరుగనట్లు దొంగతనం జరిగినట్లు పోలీసులకు చెప్పింది. జ్యోతిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments