Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతను నిలబెట్టి కాల్చి చంపిన మావోయిస్టులు...

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇటీవలికాలంలో మావో కార్యక్రమాలు జోరందుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో గ్రేహౌండ్స్ దళాలు కూంబింబ్ ఆపరేషన్లు నిర్వహించాయి. అదేసమయంలో పోలీసులు జరిపిన ఈ తనిఖీల్లో మావో ప్రముఖ నేతలు తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ కూడా మావో ప్రభావిత జిల్లాల్లో మకాం వేశారు. 
 
ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక తెరాస నేత భీమేశ్వరరావును దారుణంగా కాల్చి చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమేశ్వరరావు ఇంట్లోకి జొరబడిన ఆరుగురు మావోయిస్టులు, ఆయనను తొలుత బయటకు లాక్కొచ్చారు.
 
ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్‌ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments