Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస నేతను నిలబెట్టి కాల్చి చంపిన మావోయిస్టులు...

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇటీవలికాలంలో మావో కార్యక్రమాలు జోరందుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో గ్రేహౌండ్స్ దళాలు కూంబింబ్ ఆపరేషన్లు నిర్వహించాయి. అదేసమయంలో పోలీసులు జరిపిన ఈ తనిఖీల్లో మావో ప్రముఖ నేతలు తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ కూడా మావో ప్రభావిత జిల్లాల్లో మకాం వేశారు. 
 
ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక తెరాస నేత భీమేశ్వరరావును దారుణంగా కాల్చి చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమేశ్వరరావు ఇంట్లోకి జొరబడిన ఆరుగురు మావోయిస్టులు, ఆయనను తొలుత బయటకు లాక్కొచ్చారు.
 
ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్‌ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments