Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాలకు భార్య రాలేదని.. భర్త ఆత్మహత్య

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (10:47 IST)
బోనాలకు భార్య రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తుక్కుగూడకు చెందిన సాయి కార్తీకి గౌడ్ (33) అనే వ్యక్తి భార్య రవళితో కలిసి ఈ నెల 12వ తేదీన బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలం బేగంపేటకు వెళ్లాడు. వివాహం తర్వాత భార్యను అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. 
 
అయితే, శనివారం మీర్‌పేట్‌లో బోనాలు జరిగాయి. ఈ బోనాలు పండుగ చేసుకునేందుకు తన పిన్ని ఇంటికి వెళ్దామని, అందువల్ల తక్షణం రావాలంటూ భార్యకు ఫోన్ చేశాడు.
 
అయితే, ఆమె ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ గౌడ్... భార్యకు వీడియో కాల్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, భార్య చూస్తుండగానే ఇంటి దూలానికి ఉరివేసుకున్నాడు. ఆ వెంటనే రవళి తమ పక్కింటికి ఫోన్ చేసి తన భర్తను రక్షించాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆమె ఇంటికి చేరుకునే సమయానికి భర్త శవమైపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments